In death there is release.
నిజమనిపిస్తుంది.
నరేంద్రనాథ్ వెళ్ళిపోయాడు. విలువైన విషయాలు చెప్పీ, చెప్పీ అలిసిపోయి, ఇక చెప్పాల్సిన పనిలేకుండా వెళ్ళిపోయాడు.
ఇక ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలకు నరేన్ వస్తాడు మనసులోకి- ఏ మాటల్లో ఉన్నా తొమ్మిదికల్లా అతని మెదడు స్విచాఫ్ అయిపోయేది... ఇప్పుడు పూర్తిగా స్విచాఫ్ అయిపోయింది.
ఘోరమైన జీవిత సత్యాన్ని తన కుళ్ళుజోకుల మాధ్యమంగా పలికించీ, పలికించీ- ప్రేమగా తిడుతూ మనసులో మెచ్చుకునేవాళ్ళను వదిలేసి, ఇప్పుడు పోయాడు.
వద్దంటున్నా హోమియో మందులిచ్చీ, ఇచ్చీ, వద్దనేవాళ్ళకు అలవాటు పడిపోయాడు నరేన్. అతనికి అలవాటు పడ్డవాళ్ళం ఇప్పుడు అతను లేకపోవటానికి అలవాటు పడాలి.
నరేన్ తో ప్రత్యేకమైన వెంకట్రామాపురం ఇప్పుడు ఇంకొక గ్రామం అయిపోతుంది. ఇప్పుడక్కడ ఇక అందరూ ఇంకా లోతైన బోర్లు వేసుకోవచ్చు- అరిచేవాడే ఉండడు.
చాలా డబ్బులు పోగొట్టుకున్నాడట, తన ప్రయోగాల్లో- తనే చెప్పుకున్నాడు "ఇట్లు-ఒక రైతు" పుస్తకంలో. కానీ వాటికి కోటిరెట్లు విలువైన విలువల్ని మిత్రులకు పెట్టుబడిగా ఇచ్చాడు- సంరక్షించి, పెంచమని. పాలగుట్టపల్లిలో మామూలు కుర్రాళ్ళు ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో సంపద దాచుకున్నాడు నరేన్, నిజంగానే.
నరేన్ సంతకంనుండి సంస్థలుగానీ, సంఘాలు గానీ ఏం నేర్చుకున్నాయో తెలీదు. ఇవాల్టి ఆంధ్రజ్యోతి మథ్యపేజీలో బాలగోపాల్ బాగా రాశాడు. సంస్థలు నిజానికి వ్యక్తుల్నించి ఏమీ నేర్చుకోవనిపిస్తుంది నావరకూ. వ్యక్తులకంటే తాము ఉన్నతమైనవనుకుంటాయేమో అవి. వీలుంటే అవి వ్యక్తుల్ని ఏదో ఒక చట్రంలో బిగించి విశ్లేషిస్తాయి. ఆ తరువాత ఇంకా జగన్నాథ రథ చక్రాలు తోసుకొని పోతూనే ఉంటై.
నరేన్ ఒక వ్యక్తి. ఎంత పోయినాసరే, చాలామంది వ్యక్తులకు నరేన్ ఉన్నాడు. ఇంకా ఉంటాడు చాలా ఏళ్ళు.
(గొర్రెపాటి నరేంద్రనాథ్ నాబోటి చాలా మందికి స్ఫూర్తిదాత, గురువు.. మొన్న చనిపోయాడు.)
Monday, July 6, 2009
Friday, May 8, 2009
తెలుగమ్మకు కొత్త కర్పూరం!
రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.
జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- "అవి బాగానే వెలుగుతున్నై కదా?" అంటున్నారు. "అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, 'మన తల్లేమీ వెనకబడలేద'ని ప్రపంచానికి చాటుదాం" అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.
'చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో 'పల్సార్లు ' అని రాస్తే, ప్రొద్దున వాడెవడో "ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?" అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి 'తూపుదూబ ' (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని "అట్లనవలదార్యా" అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, "ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం" అన్నాడు వాడు. "పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?" (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.
అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. "ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది" అన్నాడు ఆనందం, వస్తూనే.
"అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?" అని విస్తుపోయాడు రామారావు.
బదులుగా "ఆ!!" అని నిర్ఘాంతపోయాడు ఆనందం. "ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని 'అంతర్జాలం' అనాలి " వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.
ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.
"అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను 'అంతర్జాలం' అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా "ఈవల" అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.
"ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని 'ఇక్కడ ' అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం" అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.
"కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, ('e')'ఈ ' అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!" అన్నాడు రామారావు వివరిస్తున్నట్లు.
ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని 'పరస్పర సంబంధ వల ' అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం" అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.
"ఏమండీ, లేస్తారా, లేదా? 'పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ' అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?" అరిచింది సరళ లోపల్నుండి.
"కోల!!" అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.
"జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి.." అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.
జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- "అవి బాగానే వెలుగుతున్నై కదా?" అంటున్నారు. "అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, 'మన తల్లేమీ వెనకబడలేద'ని ప్రపంచానికి చాటుదాం" అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.
'చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో 'పల్సార్లు ' అని రాస్తే, ప్రొద్దున వాడెవడో "ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?" అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి 'తూపుదూబ ' (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని "అట్లనవలదార్యా" అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, "ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం" అన్నాడు వాడు. "పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?" (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.
అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. "ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది" అన్నాడు ఆనందం, వస్తూనే.
"అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?" అని విస్తుపోయాడు రామారావు.
బదులుగా "ఆ!!" అని నిర్ఘాంతపోయాడు ఆనందం. "ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని 'అంతర్జాలం' అనాలి " వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.
ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.
"అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను 'అంతర్జాలం' అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా "ఈవల" అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.
"ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని 'ఇక్కడ ' అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం" అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.
"కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, ('e')'ఈ ' అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!" అన్నాడు రామారావు వివరిస్తున్నట్లు.
ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని 'పరస్పర సంబంధ వల ' అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం" అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.
"ఏమండీ, లేస్తారా, లేదా? 'పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ' అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?" అరిచింది సరళ లోపల్నుండి.
"కోల!!" అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.
"జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి.." అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.
Thursday, May 7, 2009
చరైవ..చరైవ
ఇరవై ఐదేళ్ళ క్రిందటి సంగతి...
రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.
చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.
వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. "ప్రగతి కాంవెంట్"లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ 'మమ్మీ, డాడీ'లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా "ఐ ఈజ్ గుడ్" అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.
చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. 'పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ' అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు - ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.
అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.
ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:
చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.
రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లోఉన్న వృద్ధాశ్రమంలోచేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలోహాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.
అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. "గియానంద వోల్డేజ్ హోం" లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.
ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న 'ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ' లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. "ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి" అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.
అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- "మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో" అని!
ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.
రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.
చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.
వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. "ప్రగతి కాంవెంట్"లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ 'మమ్మీ, డాడీ'లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా "ఐ ఈజ్ గుడ్" అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.
చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. 'పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ' అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు - ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.
అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.
ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:
చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.
రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లోఉన్న వృద్ధాశ్రమంలోచేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలోహాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.
అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. "గియానంద వోల్డేజ్ హోం" లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.
ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న 'ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ' లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. "ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి" అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.
అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- "మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో" అని!
ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.
Tuesday, May 5, 2009
ఓ ట్రాజెడీ..
రామారావుకు సహనం ఎక్కువ అనుకుంటుంటారు అంతా. కానీ సరళకూ, సరళ తల్లిదండ్రులకూ మాత్రం అసలు సంగతి తెలుసు- రామారావుకున్నంత కోపం, చికాకు, అసహనం ప్రపంచంలో వేరెవరికీ ఉండవంటుంది సరళ. రామారావు పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే, పదిసార్లు పిలిస్తే తప్ప పలకడు. అదీ ఏదోలా ముఖం పెట్టుకొని విన్నట్లు వింటాడు. పదిసార్లు అలా పిలిస్తే- (అంటే పదిపదులు వందసార్లన్నమాట!) అప్పుడు ఇక చికాకు పడూతూ కాగితాలు పక్కన పడేసి లేస్తాడు తను. ఆపైన మాట మాట్లాడకుండా చెప్పిన పని చేస్తాడు. సరళకే అనిపించాలన్నమాట- "ఎందుకు కదిల్చాంరా, భగవంతుడా!" అని.
సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.
రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. "పాపం, రామారావు మంచోడు" అనుకునేవాళ్ళు అందరూ.
పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. "పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?" అని సరళ వేధించేది. "మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా" అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.
గొడవలు బాగా ఎక్కువైతే "వదిలిపెట్టి పారిపోతా"ననేది సరళ. "నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని" అనేవాడు రామారావు. "ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి " అనేది సరళ. "ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?" అని గొణిగేవాడు రామారావు.
రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , "మీకేంతెలుసు" అనుకునేది. "రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం" అని పోట్లాడేది సరళ. "వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా" అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.
"తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు" అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. "ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను" అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.
మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.
"పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!" అనుకున్నారు ఇరుగుపొరుగులు.
"ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అనుకున్నది సరళ.
సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.
రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. "పాపం, రామారావు మంచోడు" అనుకునేవాళ్ళు అందరూ.
పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. "పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?" అని సరళ వేధించేది. "మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా" అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.
గొడవలు బాగా ఎక్కువైతే "వదిలిపెట్టి పారిపోతా"ననేది సరళ. "నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని" అనేవాడు రామారావు. "ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి " అనేది సరళ. "ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?" అని గొణిగేవాడు రామారావు.
రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , "మీకేంతెలుసు" అనుకునేది. "రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం" అని పోట్లాడేది సరళ. "వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా" అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.
"తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు" అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. "ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను" అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.
మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.
"పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!" అనుకున్నారు ఇరుగుపొరుగులు.
"ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అనుకున్నది సరళ.
Wednesday, March 11, 2009
మళ్ళీ వచ్చేసింది వసంతం!!
సంతోషంగా ఉందాం!!
గతించిన వసంతం మళ్ళీ రాదు.. కానీ రావలసిన వసంతం ఎలాగూ వచ్చేస్తుంది కదా!?
గత వసంతంలో మొదలు పెట్టిన ఈ కపిత్వానికి జీవితం కొద్దిగా కామాలు పెట్టింది. అయిదారు నెలల కామా తర్వాత, మళ్ళీ ఓసారి వసంతం మొదలైనట్లుంది.
అందరం సంతోషంగా ఉందాం.
పోయిన ఉగాదికి మేం మొదలుపెట్టిన కొత్తపల్లి పత్రిక ( http://kottapalli.in ), ఇప్పుడు మెల్లగా నడవటం మొదలు పెట్టింది, చాలా రచనల్నీ, నవ్వుల్నీ, సంతోషాల్నీ మోసుకుని. అనుకున్నట్లుగానే ఈ మాధ్యమంగా చాలామంది మిత్రులైనారు. వసంతం పోయి, గ్రీష్మం, ఆ పైన మిగిలిన ఋతువులన్నీ వచ్చాయి.. వాటి వాటి వాసనల్ని విరజిమ్మాయి. చూస్తూ చూస్తూండగానే మళ్ళీ చెట్లు చిగురించాయి, మళ్ళీ కోయిలలు కూయటం మొదలెట్టాయి.
మళ్ళీ వచ్చేసింది వసంతం.
అందరం సంతోషంగా ఉందాం!!!
గతించిన వసంతం మళ్ళీ రాదు.. కానీ రావలసిన వసంతం ఎలాగూ వచ్చేస్తుంది కదా!?
గత వసంతంలో మొదలు పెట్టిన ఈ కపిత్వానికి జీవితం కొద్దిగా కామాలు పెట్టింది. అయిదారు నెలల కామా తర్వాత, మళ్ళీ ఓసారి వసంతం మొదలైనట్లుంది.
అందరం సంతోషంగా ఉందాం.
పోయిన ఉగాదికి మేం మొదలుపెట్టిన కొత్తపల్లి పత్రిక ( http://kottapalli.in ), ఇప్పుడు మెల్లగా నడవటం మొదలు పెట్టింది, చాలా రచనల్నీ, నవ్వుల్నీ, సంతోషాల్నీ మోసుకుని. అనుకున్నట్లుగానే ఈ మాధ్యమంగా చాలామంది మిత్రులైనారు. వసంతం పోయి, గ్రీష్మం, ఆ పైన మిగిలిన ఋతువులన్నీ వచ్చాయి.. వాటి వాటి వాసనల్ని విరజిమ్మాయి. చూస్తూ చూస్తూండగానే మళ్ళీ చెట్లు చిగురించాయి, మళ్ళీ కోయిలలు కూయటం మొదలెట్టాయి.
మళ్ళీ వచ్చేసింది వసంతం.
అందరం సంతోషంగా ఉందాం!!!
Sunday, April 27, 2008
జెనరేషన్ గ్యాప్
కాలం ప్రవహిస్తోంది. కాల గతిలో జీవితాదర్శాలు మారతాయి, మాట్లాడే భాష,
వాడే పదాల వెనక ఉన్న భావనల లోతు, అన్నీ మారిపోతై.
"హై, సాండీ, నేనూ వస్తా రాత్రి పార్టీకి. ఏంటీ, కవితతో క్లోజ్ గా మూవ్
అవుతున్నావ్? నేనంటే మొహం మెత్తిందా?" సెల్ ఫోన్ లో తన స్నేహితుడితో
అంటోంది మా కూతురు సాహితి.
మనసులో ఏదో మూలన అర్థంకాని ఆవేదన. ఈ పార్టీలేంటి, ఆడ-మగ కలిసి
తిరగటాలేంటి? పచ్చిగా ఇలా మాట్లాడుకోవటాలేంటి? అసలు ఈ సెల్ ఫోన్లేంటి?
"ఏంటి నానా, ఎక్కడికో వెళ్లిపోయినట్లున్నావే?" అంటోంది బిడ్డ. సర్దుకున్నాను.
"ఏం లేదురా బేటా, మీ తరం పోకడలు ఎటుపోతున్నాయని ఆలోచిస్తున్నా,
ఎప్పటిలాగే."
"ఊఁ, ఆలోచించండి. ఇంకా బాగా ఆలోచించండి. జెనరేషన్ గ్యాప్ రా నానా. అది
తేలే సమస్య కాదు. అది సరే, సాయంత్రం పార్టీ. విన్నావుగా? నేను లేటుగా వస్తా,
ఒకె?"
"నేనూ రానా?" అన్నా, ఏమంటుందో చూద్దామని. ఆగిపోయి నా ముఖంలోకి
చూసింది. నేను నా మనసును వేరుచేసి దానికి మాస్క్ వేసి పెట్టుకున్నా,
సిద్ధంగా. "ఇది కపుల్స్ పార్టీరా నానా. నీకూ ఓ గాళ్ ఫ్రెండుంటే నిక్షేపంగా
రావొచ్చు. కమల ఆంటీ వస్తుందేమో కనుక్కోనా?" అంది కన్నుగీటుతూ. కమల
మా సన్నిహితురాలు, సాహిత్య ప్రేమి.
"నువ్వు టిక్కెట్లు బుక్ చెయ్యి చాలు, నేను కమలతో మాట్లాడుతాను" అన్నా.
"నీకేమీ సమస్య అవ్వదుగా?"
"వావ్, వాటె కరేజ్ మ్యాన్! మానాన మళ్ళీ కుర్రవాడౌతున్నాడు!" అంది "నాకేం
ప్రాబ్లెం? నీదారి నీది, నాదారి నాది. ఫ్రీడంరా నానా. అన్ని బాధలకీ ఒకే మందు-
ఫ్రీడం" అంది బిడ్డ.
కమలతో మాట్లాడి చెప్పాను సంగతి. "ఓ సారి చూడాలి, మా సాహితి ప్రపంచాన్ని.
వస్తావా?" అన్నా.
"ఇదేమీ గూఢచర్యం కాదుగదా, పర్లేదు వొస్తాను." అంది కమల. "ప్రియాంక గాంధీ,
వాధ్రాని కలిసిందీ డిస్కోథెక్ లోనేనట. అంత గొప్పవాళ్ళు కలవగా లేనిది,
చిన్నపిల్ల, సాహితి కలిస్తే ఏం తప్పు?" అంది తనే, మళ్లీ.
"తప్పని కాదు, కానీ వీళ్లు ఎటుపోతున్నారని ఆలోచిస్తున్నా."
"చూడండి మాస్టారూ, మీ మార్క్సిజాలూ, గాంధీజాలు ఎటుపోతున్నాయని
ఆలోచించటం అలవాటు చేస్తై. వీళ్లకు ఎవరికీ ఇజాలు లేవు. అందుకని ఆ
బరువూ లేదు. మీరు వీళ్లని మీ అద్దాల్లోంచి చూసి బాధపడుతున్నారా
అనిపిస్తోంది" కమల సాహితిని వెనకేసుకొచ్చింది, అలాగే నాపై విమర్శనాస్త్రాలు
సంధిస్తూ.
సాయంత్రం పార్టీకి వెళ్లేసరికి అది మొదలైపోయి ఉన్నది. నేను, కమల వెళ్లి మాకు
కేటాయించిన టేబుల్ దగ్గర కూచున్నాం. చుట్టూ మద్యం. స్టేజీ మీద
అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా డాన్స్ చేస్తున్నారు. పాశ్చాత్య సంగీతం
హోరెత్తుతోంది.
సాహితి ఒకడిని చేయిపట్టుకొని లాక్కొచ్చి పరిచయం చేసింది. "ఇతను స్యాండీ..
అదే.. సందీప్ నానా. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు" అని.
"మీ గురించి చెప్తుంటుంది సర్, సాహితి. మీరు తనని పెంచిన తీరు- హ్యాట్సాఫ్ టు
యు సర్" అన్నాడతను. "మా మమ్మీడాడీలు మీ రైటింగ్స్ చదువుతుంటారు.
నేను పెద్దగా ఏమీ చదవనులేండి." అన్నాడు అతనే.
నేను కమలకేసి చూశాను. "చదవనని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు?" అన్నట్లు.
కమల అతన్ని అభిమానంగా చూస్తోంది, సాహితి లాగానే. అతను ఇంకా
చెప్తున్నాడు-"మీ అమ్మాయి చాలా కన్సర్వేటివ్ సార్, మొన్నామధ్య రవి తనకి
ప్రొపోజ్ చేస్తే మానాన్న చూసినవాడినే చేసుకుంటాను పొమ్మంది."
"మరి, నువ్వు.." గొణిగా నేను. "నేను, కవిత ప్రేమించుకుంటున్నాం సర్. పెళ్ళి
చేసుకోబోతున్నాం, వచ్చే నెలలో" అని కవితను పిలిచి పరిచయం చేశాడు "హేఁ
కవీ, సాహి వాళ్ల డాడ్" అని.
సాహితి ఇంకా వాడి చెయ్యి పట్టుకొని వేళ్లాడుతోంది.
"వావ్. మీ అమ్మాయి నిజంగా చాలా మంచిది అంకుల్. సాహిత్యంలో తనకు
తెలీని అంశం లేదు. కథలు రాసేవాడిని తప్ప వేరే ఎవర్నీ చేసుకోదట" అంటోంది
కవిత.
"మరి ఇది కపుల్స్ పార్టీకదా, కవిత ఒక్కతీ ఎలా వచ్చింది? కమలని అడిగా,
వాళ్లంతా వెళ్ళాక. "రవిమీద సానుభూతితో అతన్ని వెంటబెట్టుకొచ్చింది" అంది
కమల తాపీగా కూల్ డ్రింక్ ని చప్పరిస్తూ.
నేను తేరిపార చూశాను.
"మహానుభావా, జెనరేషన్ గ్యాప్ అంటే ఏంటో విశ్లేషించినంత మాత్రాన అది
లేకుండా పోదు. నీ బిడ్డమీద నీకు నమ్మకం, గౌరవం ఉంటే తన మానాన తనని
వదలాలి. వేరే ఏమీ చేయలేవు కూడా. కళ్ళాలు బిగించినకొద్దీ ఈ తరం పిల్లలు ఆ
శృంఖలాల్ని తెంపుకు పోతారు. వాళ్లకి ప్రపంచంలో దయ, కరుణ, జాలి వేరే
రూపాల్లో ఉన్నై. అమెరికన్ సంస్కృతి మరుగున దుమ్ముకొట్టుకుపోయి ఉండొచ్చు,
నీ దృష్టిలో. కానీ ఏదో ఒక రూపంలో ఇంకా ఉన్నై, చచ్చిపోలేదు. పిల్లలు నీ
మాదిరి గాంధీని ఆరాధించరు. గాంధీగిరీని, దాన్ని తిరిగి అమ్మిన సంజయ్ దత్
లోని నటుడినీ ఆరాధిస్తారు. కానీ నువ్వు వాళ్ళను తిట్టి, చిన్నబుచ్చి, సాధించేది
ఏమీ లేదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకోవలసిందే. సాహితి మంచి పిల్ల. సొంత
నిర్ణయాల్ని తీసుకునే తెలివితేటలున్నాయ్ తనకు. అది నీ అదృష్టం అనుకో." అంది
కమల స్పీచ్ ఇస్తున్నట్లు.
"అయినా, ఇలాంటి జనాలవల్ల మన సమాజంలోని పేదవాడికి ఏం ఒరుగుతుంది?
మన సమాజం ఎటు పోతోంది?" అన్నా.
కమల మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను, కమల పాత తరం వాళ్లం. జెనరేషన్
గ్యాప్ ని అధిగమించటం దాదాపు అసాధ్యం మాకు.
వాడే పదాల వెనక ఉన్న భావనల లోతు, అన్నీ మారిపోతై.
"హై, సాండీ, నేనూ వస్తా రాత్రి పార్టీకి. ఏంటీ, కవితతో క్లోజ్ గా మూవ్
అవుతున్నావ్? నేనంటే మొహం మెత్తిందా?" సెల్ ఫోన్ లో తన స్నేహితుడితో
అంటోంది మా కూతురు సాహితి.
మనసులో ఏదో మూలన అర్థంకాని ఆవేదన. ఈ పార్టీలేంటి, ఆడ-మగ కలిసి
తిరగటాలేంటి? పచ్చిగా ఇలా మాట్లాడుకోవటాలేంటి? అసలు ఈ సెల్ ఫోన్లేంటి?
"ఏంటి నానా, ఎక్కడికో వెళ్లిపోయినట్లున్నావే?" అంటోంది బిడ్డ. సర్దుకున్నాను.
"ఏం లేదురా బేటా, మీ తరం పోకడలు ఎటుపోతున్నాయని ఆలోచిస్తున్నా,
ఎప్పటిలాగే."
"ఊఁ, ఆలోచించండి. ఇంకా బాగా ఆలోచించండి. జెనరేషన్ గ్యాప్ రా నానా. అది
తేలే సమస్య కాదు. అది సరే, సాయంత్రం పార్టీ. విన్నావుగా? నేను లేటుగా వస్తా,
ఒకె?"
"నేనూ రానా?" అన్నా, ఏమంటుందో చూద్దామని. ఆగిపోయి నా ముఖంలోకి
చూసింది. నేను నా మనసును వేరుచేసి దానికి మాస్క్ వేసి పెట్టుకున్నా,
సిద్ధంగా. "ఇది కపుల్స్ పార్టీరా నానా. నీకూ ఓ గాళ్ ఫ్రెండుంటే నిక్షేపంగా
రావొచ్చు. కమల ఆంటీ వస్తుందేమో కనుక్కోనా?" అంది కన్నుగీటుతూ. కమల
మా సన్నిహితురాలు, సాహిత్య ప్రేమి.
"నువ్వు టిక్కెట్లు బుక్ చెయ్యి చాలు, నేను కమలతో మాట్లాడుతాను" అన్నా.
"నీకేమీ సమస్య అవ్వదుగా?"
"వావ్, వాటె కరేజ్ మ్యాన్! మానాన మళ్ళీ కుర్రవాడౌతున్నాడు!" అంది "నాకేం
ప్రాబ్లెం? నీదారి నీది, నాదారి నాది. ఫ్రీడంరా నానా. అన్ని బాధలకీ ఒకే మందు-
ఫ్రీడం" అంది బిడ్డ.
కమలతో మాట్లాడి చెప్పాను సంగతి. "ఓ సారి చూడాలి, మా సాహితి ప్రపంచాన్ని.
వస్తావా?" అన్నా.
"ఇదేమీ గూఢచర్యం కాదుగదా, పర్లేదు వొస్తాను." అంది కమల. "ప్రియాంక గాంధీ,
వాధ్రాని కలిసిందీ డిస్కోథెక్ లోనేనట. అంత గొప్పవాళ్ళు కలవగా లేనిది,
చిన్నపిల్ల, సాహితి కలిస్తే ఏం తప్పు?" అంది తనే, మళ్లీ.
"తప్పని కాదు, కానీ వీళ్లు ఎటుపోతున్నారని ఆలోచిస్తున్నా."
"చూడండి మాస్టారూ, మీ మార్క్సిజాలూ, గాంధీజాలు ఎటుపోతున్నాయని
ఆలోచించటం అలవాటు చేస్తై. వీళ్లకు ఎవరికీ ఇజాలు లేవు. అందుకని ఆ
బరువూ లేదు. మీరు వీళ్లని మీ అద్దాల్లోంచి చూసి బాధపడుతున్నారా
అనిపిస్తోంది" కమల సాహితిని వెనకేసుకొచ్చింది, అలాగే నాపై విమర్శనాస్త్రాలు
సంధిస్తూ.
సాయంత్రం పార్టీకి వెళ్లేసరికి అది మొదలైపోయి ఉన్నది. నేను, కమల వెళ్లి మాకు
కేటాయించిన టేబుల్ దగ్గర కూచున్నాం. చుట్టూ మద్యం. స్టేజీ మీద
అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా డాన్స్ చేస్తున్నారు. పాశ్చాత్య సంగీతం
హోరెత్తుతోంది.
సాహితి ఒకడిని చేయిపట్టుకొని లాక్కొచ్చి పరిచయం చేసింది. "ఇతను స్యాండీ..
అదే.. సందీప్ నానా. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు" అని.
"మీ గురించి చెప్తుంటుంది సర్, సాహితి. మీరు తనని పెంచిన తీరు- హ్యాట్సాఫ్ టు
యు సర్" అన్నాడతను. "మా మమ్మీడాడీలు మీ రైటింగ్స్ చదువుతుంటారు.
నేను పెద్దగా ఏమీ చదవనులేండి." అన్నాడు అతనే.
నేను కమలకేసి చూశాను. "చదవనని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు?" అన్నట్లు.
కమల అతన్ని అభిమానంగా చూస్తోంది, సాహితి లాగానే. అతను ఇంకా
చెప్తున్నాడు-"మీ అమ్మాయి చాలా కన్సర్వేటివ్ సార్, మొన్నామధ్య రవి తనకి
ప్రొపోజ్ చేస్తే మానాన్న చూసినవాడినే చేసుకుంటాను పొమ్మంది."
"మరి, నువ్వు.." గొణిగా నేను. "నేను, కవిత ప్రేమించుకుంటున్నాం సర్. పెళ్ళి
చేసుకోబోతున్నాం, వచ్చే నెలలో" అని కవితను పిలిచి పరిచయం చేశాడు "హేఁ
కవీ, సాహి వాళ్ల డాడ్" అని.
సాహితి ఇంకా వాడి చెయ్యి పట్టుకొని వేళ్లాడుతోంది.
"వావ్. మీ అమ్మాయి నిజంగా చాలా మంచిది అంకుల్. సాహిత్యంలో తనకు
తెలీని అంశం లేదు. కథలు రాసేవాడిని తప్ప వేరే ఎవర్నీ చేసుకోదట" అంటోంది
కవిత.
"మరి ఇది కపుల్స్ పార్టీకదా, కవిత ఒక్కతీ ఎలా వచ్చింది? కమలని అడిగా,
వాళ్లంతా వెళ్ళాక. "రవిమీద సానుభూతితో అతన్ని వెంటబెట్టుకొచ్చింది" అంది
కమల తాపీగా కూల్ డ్రింక్ ని చప్పరిస్తూ.
నేను తేరిపార చూశాను.
"మహానుభావా, జెనరేషన్ గ్యాప్ అంటే ఏంటో విశ్లేషించినంత మాత్రాన అది
లేకుండా పోదు. నీ బిడ్డమీద నీకు నమ్మకం, గౌరవం ఉంటే తన మానాన తనని
వదలాలి. వేరే ఏమీ చేయలేవు కూడా. కళ్ళాలు బిగించినకొద్దీ ఈ తరం పిల్లలు ఆ
శృంఖలాల్ని తెంపుకు పోతారు. వాళ్లకి ప్రపంచంలో దయ, కరుణ, జాలి వేరే
రూపాల్లో ఉన్నై. అమెరికన్ సంస్కృతి మరుగున దుమ్ముకొట్టుకుపోయి ఉండొచ్చు,
నీ దృష్టిలో. కానీ ఏదో ఒక రూపంలో ఇంకా ఉన్నై, చచ్చిపోలేదు. పిల్లలు నీ
మాదిరి గాంధీని ఆరాధించరు. గాంధీగిరీని, దాన్ని తిరిగి అమ్మిన సంజయ్ దత్
లోని నటుడినీ ఆరాధిస్తారు. కానీ నువ్వు వాళ్ళను తిట్టి, చిన్నబుచ్చి, సాధించేది
ఏమీ లేదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకోవలసిందే. సాహితి మంచి పిల్ల. సొంత
నిర్ణయాల్ని తీసుకునే తెలివితేటలున్నాయ్ తనకు. అది నీ అదృష్టం అనుకో." అంది
కమల స్పీచ్ ఇస్తున్నట్లు.
"అయినా, ఇలాంటి జనాలవల్ల మన సమాజంలోని పేదవాడికి ఏం ఒరుగుతుంది?
మన సమాజం ఎటు పోతోంది?" అన్నా.
కమల మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను, కమల పాత తరం వాళ్లం. జెనరేషన్
గ్యాప్ ని అధిగమించటం దాదాపు అసాధ్యం మాకు.
Tuesday, April 8, 2008
జామచెట్టు నవ్వింది!!
చెట్లు పండ్లెందుకిస్తాయి?
పిల్లలూ, ఉడతలూ, చిలకలూ అవి తమకోసమే అనుకుంటాయి. మనం, పెద్దవాళ్లం, తమ జాతిని విస్తరింపజేయటం కోసమే చెట్లు పండ్లనిస్తాయని చెప్పుకుంటాం- మనసులో మాత్రం, మనమూ ఆ పండ్లన్నీ మనకోసమేననుకుంటాం. దేవుడు మనిషిని తనలా సృష్టిస్తే, మనిషి దేవుడిని తనలా సృష్టించాడట!
ఏమో, అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటూ ఉంటే, అసలు సృష్టికర్తలైన ఆ చెట్లు నవ్వుకుంటూ, సంతోషంగా తలలూపి, పండ్లను ఇంకా క్రిందికి, క్రిందికి అందిస్తున్నాయేమో.
లేకపోతే ఏ చెట్టుకాకారణాలుండచ్చు. ఒక్కో చెట్టును ప్రత్యేకంగా అడగాలేమో, నువ్వెందుకు కాయలిస్తావని. అయితే సామాన్యంగా ఏ చెట్టూ ఈ ప్రశ్నకు సరైన జవాబిస్తున్నట్లు లేదు-
ముఖ్యంగా మా ఇంట్లో జామచెట్టు. ఎంత అడిగినా ఉలకదు, పలకదు.
మామూలుగా ఎలాగూ మాట్లాడదు. కొంచెం కవితావేశంతో అడిగితే వేరే ప్రశ్నలన్నిటికీ జవాబిస్తుంది, కానీ ఈ ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానం. అది ఇలా జవాబు చెప్పనప్పుడల్లా నేను ఉక్రోషంతో ఉడుక్కునేవాణ్ణి. నా అంతటివాడికి
జవాబియ్యట్లేదని చిన్నబుచ్చుకునేవాడిని.
అలా జరిగిన ప్రతిసారీ జామ చెట్టు కలవర పడేది. తన మొద్దు మొద్దు ఆకుల్ని నాకు తగిలించేందుకు పెళుసు కొమ్మల్నే కొద్ది కొద్దిగా వంచేది. కాయల్ని, పండ్లని నాకు ఇంకా దగ్గర చేసి అందుకొమ్మని సైగలు చేసేది.- కానీ జవాబు మాత్రం ఇచ్చేదికాదు.
లక్షలమందికి తన ప్రవచనాలతో స్ఫూర్తినిచ్చి తరింపజేసిన బుద్ధమూర్తి కొన్ని ప్రశ్నలడిగితే మాత్రం ముని అయ్యేవాడట. అలా మౌనంతో ఆయన ఉరిమితే, ఆ ఫెళ ఫెళలకు ప్రశ్నించిన వాళ్ల అహంకారం పగిలి అంతర్గంగ ధారలై పారేదట!
మా జామచెట్టు మౌనం మరి నన్నేమీ చేయలేకపోతోంది ఎందుకో. బండబారిన నా హృదయాన్ని తాకేంత శక్తి దాని మౌనానికి లేదేమో ఇంకా. నా అహంకారాన్ని స్పృశించేంత చనువు తీసుకోలేక ఊరుకుంటోందేమో, మరి.
చిన్నప్పటినుండి దాన్ని సాకింది నేనే. ఓ రోజు ప్రొద్దునే పళ్లు తోముకుంటుండగా ఉమ్మివేసే చోట బుజ్జి బుజ్జి ఆకులు వేసిన చిన్న మొక్క కనిపించింది, పదిహేనేళ్ల క్రితం. అప్పట్లో దాన్ని జాగ్రత్తగా త్రవ్వి తీసి, మా ఇంటి పెరడులో తలుపుకెదురుగా నాటి, రోజూ అదెలా ఉందని చూసేవాళ్లం. తరువాత్తరువాత పట్టించుకోవలసిన వాళ్లు వచ్చేసరికి దానిపై శ్రద్ధ తగ్గింది. పండ్ల కాలంలో తప్ప ఇతరసమయాల్లో పెద్దగా తలచుకోలేదు. ఇప్పుడు పిల్లలందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోయారు, మేమూ, జామచెట్టూ మిగిలాం మళ్లీ.
మధ్యమధ్య పిల్లలొస్తారు, వాళ్ల పిల్లలతో. మళ్లీ సందడి. అందరూ నవ్వుతారు, హడావిడి పడతారు, కష్టాలు, సుఖాలు పంచుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, సలహాలిస్తారు, పెరట్లో చెట్టునెక్కి వెతుక్కుంటారు, వెళ్లి పోతారు, ఇంకోసారి
వచ్చేందుకు. వాళ్లు వచ్చేసరికి చెట్టంతా పళ్లతో నిండి ఉంటే ఎంత బాగుండు! ఇన్నాళ్ల పెంపకమూ ఫలించినట్లౌతుంది.
మేం జామచెట్టును ఎందుకు పెంచాం, అసలు? కాయలకోసమేనా? కాదేమో. కొత్తగా కట్టిన ఇంటికి జామచెట్టు అందంకాదూ? ఆ జామచెట్టు చిన్ని మొక్కగా ఉన్నది, పెరిగి పెద్దదౌతుంటే, రోజూ కొన్ని ఆకులూ, రెమ్మలూ, కొమ్మలూ వేసి ఎదుగుతూ సంతోషంగా ఊగితే, దాన్ని తగిలి పులకించిన గాలి, మాకు గిలిగింతలు పెడితే, దాని పూల కమ్మని వాసన తెలిసీ తెలీని మా మనసుల్ని ఉల్లాస పరిస్తే, ఆ హాయిని సాంతంగా, సొంతంగా అనుభవించాలనే స్వార్థం లేదూ, అందులో? చిన్న పిల్లల్ని పెంచటంలో ఉన్న ఆనందం కొంచెం కొంచెంగా అర్థమౌతున్న ఆరోజుల్లో ఇంకో మూగ ప్రాణి మా చెంత పెరిగి పెద్దదైతే చాలునన్న ఆత్మానందం లేదూ, దాని వెనక? ఇంకా చెప్పటానికి రాని, మాటలకందని భావనలు ఎన్ని ఉంటాయో?
ఎవరైనా నువ్వెందుకు పెంచావని నన్నడిగితే, నేను ఏం చెప్పగలను, నిజంగా? అయినా మా కోరిక మాత్రం చావదు. ఆ చెట్టు మా సొంతం. మా సొంత చెట్టు ఇంకా ఇంకా కాయలు, పళ్లు ఇస్తూనే ఉంటుంది. అదిచ్చే ఆ పళ్లన్నీ మా సొంతమే. వాటిని మేం తింటాం- మేమూ, మా పిల్లలు, వాళ్ల పిల్లలు- అంతే. వేరే వాళ్లకు మేం ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. మా ఆస్తి ఇది. ఇతరులెవరికైనా జామకాయలు కావాలంటే మమ్మల్ని అడగాలంతే. మేం ఇచ్చి దాతలమని పుణ్యం, పేరు గడిస్తాం- ఇవ్వకపోతే తిట్లు తినటంలేదూ, మరి?
కానీ, జనాలు...! ఊరుకోరు. ముఖ్యంగా అలగా జనాలు. ఆ ప్రక్కన గుడిశల్లో ఉంటారే, శుచీ శుభ్రతా తెలీని జనాలు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీక తమ మాదిరే అడుక్కు తినేలా తయారు చేసే వాళ్లు, వాళ్ల పిల్లలు- వాళ్ల కళ్లన్నీ మా జామచెట్టు మీదనే. స్కూళ్లూ, బళ్ళూ ఎలాగూ లేవు. వాళ్లకు, పిల్లలకీ అంతే, పెద్దలకీ అంతే- సమయం అనేదే లేదు- పొద్దు పొడిచింది మొదలు గోడ వెనక్కే చేరతారు. కట్టెలతో, రాళ్లతో పండ్లు తెంపేందుకు చూస్తారు, వాళ్ల సొంత చెట్టుకు మల్లే. మేం చూసి అరవకపోతే, పరిగెత్తుకొచ్చి తిట్టకపోతే గోడనెక్కేస్తారు కూడాను!
అన్నీ వట్టి ఈ జామకాయలకోసమే. బజార్లో దొరుకుతాయి- కొనుక్కోవచ్చుగదా? ఎందుకు, మా పళ్లే ఆశించాలి? ఈ పిల్లలు ఊరికే రారు. రాళ్లు వేస్తారు. ఆ రాళ్లు ఇంటివాళ్లకు, ఇంటికి ఎవరికి ఎక్కడ తగుల్తాయో చెప్పలేం. కొందరైతే ఏకంగా వంకీ కర్రలు, బుట్టలు పట్టుకొని వస్తారు.
పిల్లలేనంటే, పెద్దవాళ్లు ఇంకా అతి అయిపోయారు. వచ్చి గుమ్మానికి ఎదురుగా మునివేళ్లమీద నిలబడి వంకీ కర్రల్తో పండ్లు కోసుకుంటుంటే చూసి, అరుస్తామా, "ఏమయ్యా, ఏమ్మా, పనిలేదా, చెట్టు మీదే అనుకుంటున్నారా? సిగ్గు లేకుండా అంత బాహాటంగా కోసుకుంటున్నారా, కనీసం అడగాలన్న జ్ఞానం కూడా లేదా? అడిగితే మేం ఇవ్వకపోదుమా, ఓ కాయ? అంత సభ్యత, సంస్కారం లేకుండా ఇంకోళ్ల ఇంటి లోపలి చెట్టు కాయలు తెంపుతున్నారేం?" అని, వాళ్లంటారు- " సరే, మీరు లేరు అనుకొని కోసుకున్నాం. ఇప్పుడు వచ్చారు గదా, మా పాపకు కావాలట, కొన్ని పండ్లు మీరు ఇవ్వండి ఇప్పుడు". అలా అంటూండగానే మరో నాలుగుపళ్ళు వంకీ కర్ర బారిన పడతాయి. అరవటం తప్ప ఏమీ చేయలేని బుసకొట్టే ముసలి పాముల ముఖాలు ముడుచుకు పోతై. ఇంకొంచెం గొంతు పెంచేసరికి- " మరీ అంత కోపం వద్దు సార్, ఏదో పిల్లలు, కొన్ని పండ్లడిగితే ఇస్తే మీదేం పోతుంది?" అంటారు.
పండే రోజుల్లో గుంఫు తరువాత గుంపు- ఇదే వరస...
వాళ్ల బారినుండి తప్పించుకునేందుకు చెట్టునంతా- పచ్చిచి, పండువీ అన్నిటినీ ఊడ్చేయటం కూడా చేశాం, కొన్నిసార్లు. అలా కోసిన కాయల్ని మేం తినలేక, అవి పండిపోయి, ఎండిపోయి, మురిగిపోతుండగా గోమాతకోసం ప్రక్కకు పెట్టాం కూడా.
ఇదంతా గమనిస్తున్న జామచెట్టు నవ్వింది, మళ్లీ, మళ్లీ. జవాబులేని ప్రశ్నలు నన్నెందుకు అడిగావని, విరగబడి నవ్వింది.
పిల్లలూ, ఉడతలూ, చిలకలూ అవి తమకోసమే అనుకుంటాయి. మనం, పెద్దవాళ్లం, తమ జాతిని విస్తరింపజేయటం కోసమే చెట్లు పండ్లనిస్తాయని చెప్పుకుంటాం- మనసులో మాత్రం, మనమూ ఆ పండ్లన్నీ మనకోసమేననుకుంటాం. దేవుడు మనిషిని తనలా సృష్టిస్తే, మనిషి దేవుడిని తనలా సృష్టించాడట!
ఏమో, అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటూ ఉంటే, అసలు సృష్టికర్తలైన ఆ చెట్లు నవ్వుకుంటూ, సంతోషంగా తలలూపి, పండ్లను ఇంకా క్రిందికి, క్రిందికి అందిస్తున్నాయేమో.
లేకపోతే ఏ చెట్టుకాకారణాలుండచ్చు. ఒక్కో చెట్టును ప్రత్యేకంగా అడగాలేమో, నువ్వెందుకు కాయలిస్తావని. అయితే సామాన్యంగా ఏ చెట్టూ ఈ ప్రశ్నకు సరైన జవాబిస్తున్నట్లు లేదు-
ముఖ్యంగా మా ఇంట్లో జామచెట్టు. ఎంత అడిగినా ఉలకదు, పలకదు.
మామూలుగా ఎలాగూ మాట్లాడదు. కొంచెం కవితావేశంతో అడిగితే వేరే ప్రశ్నలన్నిటికీ జవాబిస్తుంది, కానీ ఈ ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానం. అది ఇలా జవాబు చెప్పనప్పుడల్లా నేను ఉక్రోషంతో ఉడుక్కునేవాణ్ణి. నా అంతటివాడికి
జవాబియ్యట్లేదని చిన్నబుచ్చుకునేవాడిని.
అలా జరిగిన ప్రతిసారీ జామ చెట్టు కలవర పడేది. తన మొద్దు మొద్దు ఆకుల్ని నాకు తగిలించేందుకు పెళుసు కొమ్మల్నే కొద్ది కొద్దిగా వంచేది. కాయల్ని, పండ్లని నాకు ఇంకా దగ్గర చేసి అందుకొమ్మని సైగలు చేసేది.- కానీ జవాబు మాత్రం ఇచ్చేదికాదు.
లక్షలమందికి తన ప్రవచనాలతో స్ఫూర్తినిచ్చి తరింపజేసిన బుద్ధమూర్తి కొన్ని ప్రశ్నలడిగితే మాత్రం ముని అయ్యేవాడట. అలా మౌనంతో ఆయన ఉరిమితే, ఆ ఫెళ ఫెళలకు ప్రశ్నించిన వాళ్ల అహంకారం పగిలి అంతర్గంగ ధారలై పారేదట!
మా జామచెట్టు మౌనం మరి నన్నేమీ చేయలేకపోతోంది ఎందుకో. బండబారిన నా హృదయాన్ని తాకేంత శక్తి దాని మౌనానికి లేదేమో ఇంకా. నా అహంకారాన్ని స్పృశించేంత చనువు తీసుకోలేక ఊరుకుంటోందేమో, మరి.
చిన్నప్పటినుండి దాన్ని సాకింది నేనే. ఓ రోజు ప్రొద్దునే పళ్లు తోముకుంటుండగా ఉమ్మివేసే చోట బుజ్జి బుజ్జి ఆకులు వేసిన చిన్న మొక్క కనిపించింది, పదిహేనేళ్ల క్రితం. అప్పట్లో దాన్ని జాగ్రత్తగా త్రవ్వి తీసి, మా ఇంటి పెరడులో తలుపుకెదురుగా నాటి, రోజూ అదెలా ఉందని చూసేవాళ్లం. తరువాత్తరువాత పట్టించుకోవలసిన వాళ్లు వచ్చేసరికి దానిపై శ్రద్ధ తగ్గింది. పండ్ల కాలంలో తప్ప ఇతరసమయాల్లో పెద్దగా తలచుకోలేదు. ఇప్పుడు పిల్లలందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోయారు, మేమూ, జామచెట్టూ మిగిలాం మళ్లీ.
మధ్యమధ్య పిల్లలొస్తారు, వాళ్ల పిల్లలతో. మళ్లీ సందడి. అందరూ నవ్వుతారు, హడావిడి పడతారు, కష్టాలు, సుఖాలు పంచుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, సలహాలిస్తారు, పెరట్లో చెట్టునెక్కి వెతుక్కుంటారు, వెళ్లి పోతారు, ఇంకోసారి
వచ్చేందుకు. వాళ్లు వచ్చేసరికి చెట్టంతా పళ్లతో నిండి ఉంటే ఎంత బాగుండు! ఇన్నాళ్ల పెంపకమూ ఫలించినట్లౌతుంది.
మేం జామచెట్టును ఎందుకు పెంచాం, అసలు? కాయలకోసమేనా? కాదేమో. కొత్తగా కట్టిన ఇంటికి జామచెట్టు అందంకాదూ? ఆ జామచెట్టు చిన్ని మొక్కగా ఉన్నది, పెరిగి పెద్దదౌతుంటే, రోజూ కొన్ని ఆకులూ, రెమ్మలూ, కొమ్మలూ వేసి ఎదుగుతూ సంతోషంగా ఊగితే, దాన్ని తగిలి పులకించిన గాలి, మాకు గిలిగింతలు పెడితే, దాని పూల కమ్మని వాసన తెలిసీ తెలీని మా మనసుల్ని ఉల్లాస పరిస్తే, ఆ హాయిని సాంతంగా, సొంతంగా అనుభవించాలనే స్వార్థం లేదూ, అందులో? చిన్న పిల్లల్ని పెంచటంలో ఉన్న ఆనందం కొంచెం కొంచెంగా అర్థమౌతున్న ఆరోజుల్లో ఇంకో మూగ ప్రాణి మా చెంత పెరిగి పెద్దదైతే చాలునన్న ఆత్మానందం లేదూ, దాని వెనక? ఇంకా చెప్పటానికి రాని, మాటలకందని భావనలు ఎన్ని ఉంటాయో?
ఎవరైనా నువ్వెందుకు పెంచావని నన్నడిగితే, నేను ఏం చెప్పగలను, నిజంగా? అయినా మా కోరిక మాత్రం చావదు. ఆ చెట్టు మా సొంతం. మా సొంత చెట్టు ఇంకా ఇంకా కాయలు, పళ్లు ఇస్తూనే ఉంటుంది. అదిచ్చే ఆ పళ్లన్నీ మా సొంతమే. వాటిని మేం తింటాం- మేమూ, మా పిల్లలు, వాళ్ల పిల్లలు- అంతే. వేరే వాళ్లకు మేం ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. మా ఆస్తి ఇది. ఇతరులెవరికైనా జామకాయలు కావాలంటే మమ్మల్ని అడగాలంతే. మేం ఇచ్చి దాతలమని పుణ్యం, పేరు గడిస్తాం- ఇవ్వకపోతే తిట్లు తినటంలేదూ, మరి?
కానీ, జనాలు...! ఊరుకోరు. ముఖ్యంగా అలగా జనాలు. ఆ ప్రక్కన గుడిశల్లో ఉంటారే, శుచీ శుభ్రతా తెలీని జనాలు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీక తమ మాదిరే అడుక్కు తినేలా తయారు చేసే వాళ్లు, వాళ్ల పిల్లలు- వాళ్ల కళ్లన్నీ మా జామచెట్టు మీదనే. స్కూళ్లూ, బళ్ళూ ఎలాగూ లేవు. వాళ్లకు, పిల్లలకీ అంతే, పెద్దలకీ అంతే- సమయం అనేదే లేదు- పొద్దు పొడిచింది మొదలు గోడ వెనక్కే చేరతారు. కట్టెలతో, రాళ్లతో పండ్లు తెంపేందుకు చూస్తారు, వాళ్ల సొంత చెట్టుకు మల్లే. మేం చూసి అరవకపోతే, పరిగెత్తుకొచ్చి తిట్టకపోతే గోడనెక్కేస్తారు కూడాను!
అన్నీ వట్టి ఈ జామకాయలకోసమే. బజార్లో దొరుకుతాయి- కొనుక్కోవచ్చుగదా? ఎందుకు, మా పళ్లే ఆశించాలి? ఈ పిల్లలు ఊరికే రారు. రాళ్లు వేస్తారు. ఆ రాళ్లు ఇంటివాళ్లకు, ఇంటికి ఎవరికి ఎక్కడ తగుల్తాయో చెప్పలేం. కొందరైతే ఏకంగా వంకీ కర్రలు, బుట్టలు పట్టుకొని వస్తారు.
పిల్లలేనంటే, పెద్దవాళ్లు ఇంకా అతి అయిపోయారు. వచ్చి గుమ్మానికి ఎదురుగా మునివేళ్లమీద నిలబడి వంకీ కర్రల్తో పండ్లు కోసుకుంటుంటే చూసి, అరుస్తామా, "ఏమయ్యా, ఏమ్మా, పనిలేదా, చెట్టు మీదే అనుకుంటున్నారా? సిగ్గు లేకుండా అంత బాహాటంగా కోసుకుంటున్నారా, కనీసం అడగాలన్న జ్ఞానం కూడా లేదా? అడిగితే మేం ఇవ్వకపోదుమా, ఓ కాయ? అంత సభ్యత, సంస్కారం లేకుండా ఇంకోళ్ల ఇంటి లోపలి చెట్టు కాయలు తెంపుతున్నారేం?" అని, వాళ్లంటారు- " సరే, మీరు లేరు అనుకొని కోసుకున్నాం. ఇప్పుడు వచ్చారు గదా, మా పాపకు కావాలట, కొన్ని పండ్లు మీరు ఇవ్వండి ఇప్పుడు". అలా అంటూండగానే మరో నాలుగుపళ్ళు వంకీ కర్ర బారిన పడతాయి. అరవటం తప్ప ఏమీ చేయలేని బుసకొట్టే ముసలి పాముల ముఖాలు ముడుచుకు పోతై. ఇంకొంచెం గొంతు పెంచేసరికి- " మరీ అంత కోపం వద్దు సార్, ఏదో పిల్లలు, కొన్ని పండ్లడిగితే ఇస్తే మీదేం పోతుంది?" అంటారు.
పండే రోజుల్లో గుంఫు తరువాత గుంపు- ఇదే వరస...
వాళ్ల బారినుండి తప్పించుకునేందుకు చెట్టునంతా- పచ్చిచి, పండువీ అన్నిటినీ ఊడ్చేయటం కూడా చేశాం, కొన్నిసార్లు. అలా కోసిన కాయల్ని మేం తినలేక, అవి పండిపోయి, ఎండిపోయి, మురిగిపోతుండగా గోమాతకోసం ప్రక్కకు పెట్టాం కూడా.
ఇదంతా గమనిస్తున్న జామచెట్టు నవ్వింది, మళ్లీ, మళ్లీ. జవాబులేని ప్రశ్నలు నన్నెందుకు అడిగావని, విరగబడి నవ్వింది.
Subscribe to:
Posts (Atom)